స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. పాన్ఇండియా మూవీగా తీసుకొస్తున్నారు. అంతేకాక రెండు పార్ట్లుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు టాక్. మొత్తానికి ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.
ఇదిలా ఉంటే లాక్డౌన్తో ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. నిన్నటి నుంచి హైదరాబాద్లో చివరి షెడ్యూల్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో దాదాపు 45 రోజులు నిరంతరాయంగా షూటింగ్ జరుపుతారట. దీంతో ఈ మూవీ మొదటి పార్ట్ షూటింగ్ పూర్తవుతుంది.ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని పాన్ ఇండియా లెవెల్లో భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: వనితా వర్సెస్ రమ్యకృష్ణ.. ఏమిటీ పంచాయితీ?
అయితే ఈ సినిమా విడుదల పై క్లారిటీ లేదు. దసరాకు ముందు ఆచార్య వస్తుండగా, అక్టోబర్ 13 దసరా కానుకగా ఆర్ఆర్ఆర్ రానున్నది. ఆ తర్వాత వినాయక చవితికి అఖండ విడుదల అవుతుంది. దీంతో పుష్ప విడుదల ఎప్పుడు అనేది క్లారిటీ రావడం లేదు. కాగా పుష్పలో అల్లు అర్జున్ చెల్లెలిగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఈ సినిమాతో తెలుగు తెరకి మాలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పరిచయమవుతున్నాడు.కరోనా ఎఫెక్ట్తో ఇప్పటికే పలు భారీ బడ్జెట్ చిత్రాల షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆచార్య షూటింగ్ కూడా ఇవాళ షూటింగ్ ప్రారంమైంది.
Also Read: అమీర్.. కిరణ్ రావు విడిపోవడానికి కారణం ఆమె నా..?