Thursday, April 25, 2024
- Advertisement -

త్వరలోనే మీ ఇంటికి రాబోతున్న పుష్పరాజ్‌..

- Advertisement -

డిసెంబర్ 17న విడుదలై బాక్సాఫిస్ వ‌ద్ద దూసుకెళ్తున్న‌ పుష్ప త్వరలో ఓటీటీలోనూ రాబోతున్నది. స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​.. క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో భారీ బడ్జెట్​తో తెరకెక్కిన పాన్​ఇండియా సినిమాను సంక్రాంతి కానుకగా ఈ నెల 7 నుంచి ఓటీటీలోనూ ప్ర‌సారం కానుంద‌ని అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందిన పుష్ప సినిమా ఈ నెల 7న రాత్రి 8 గంట‌ల నుంచి త‌మ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంద‌ని అమెజాన్ ప్రైమ్ ఫొటోను పోస్ట్ చేసింది. ఇప్పటికే యూట్యూబ్ లో రికార్డులు.. బాక్సాఫిస్ వద్ద దూసుకు పోతుంది. ఇక ఓటీటీలో ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

ఎర్రచందనం స్మగ్లింగ్​ కథాంశంతో తెరకెక్కిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్​ సరసన హీరోయిన్ గా రష్మిక మందన, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యం వహించగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ నిర్మించిన విషయం తెలిసిందే.

అనుకున్నదే జరిగింది రాధేశ్యామ్ వాయిదా

పోలీసు ఆఫీసర్ గా చార్జ్ తీసుకోనున్న ప్రభాస్

బాలయ్యను ఢీ కొట్టనున్న జయమ్మ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -