మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్తో కలిసి యుద్ధభూమిలో అల్లు శిరీశ్ పోరాడుతున్నారు. వారిద్దరూ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘1971: బియాండ్ బోర్డర్స్’ను మేజర్ రవి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా గతేడాది మలయాళంలో విడుదలై హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమాను ‘యుద్ధభూమి: 1971 భారత సరిహద్దు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు.
1971లో భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మోహన్లాల్ కల్నల్ మహదేవన్ పాత్రలో నటిస్తుండగా అల్లు శిరీశ్ లెఫ్టినెంట్ చిన్మయ్ పాత్రలో కనిపించనున్నారు. ‘వార్ ఫీల్డ్లో లవ్ లెటర్స్కు రొమాన్స్కి నో టైమ్’ అంటూ అల్లు శిరీశ్కు మోహన్లాల్ సలహా ఇస్తూ ట్రైలర్లో కనిపించారు. అయితే శిరీవ్ అవి పట్టించుకోకుండా తన ప్రేయసితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాకు సిద్ధార్థ్ విపిన్, నజీమ్ అర్షద్, రాహుల్ సుబ్రమణియన్ మ్యూజిక్ అందించారు. గోపీ సుందర్ నేపథ్య సంగీతం అందించారు.
జస్రాజ్ ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై ఏఎన్ బాలాజీ నిర్మిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
https://www.youtube.com/watch?v=e_2YYhxGSH8