ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య లో అధిక రక్తపోటు సమస్య ఒకటి. రోజురోజుకు ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడే వారి సంఖ్య అధికమవుతోంది. మన శరీరంలో రక్త సరఫరాలో ఏర్పడే సమస్యల కారణంగానే రక్తపోటు సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ విధమైనటువంటి సమస్యతో బాధపడేవారు సరైన ఆహార నియమాలను పాటించడం, సరైన ఉప్పును తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం, మంచి ఆహార నియమాలు పాటించడం ద్వారా నియంత్రణలో ఉంచుకోవచ్చు. రక్తపోటు ఈ సమస్యతో బాధపడే వారు నియంత్రణలో ఉంచుకోవాలంటే ఏ విధమైనటువంటి ఉప్పు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
మన శరీరానికి వివిధ పోషక పదార్థాలతో పాటు సోడియం పొటాషియం ఎంతో అవసరం.అయితే సోడియం, పొటాషియం మన శరీరానికి అందాలంటే మనం తీసుకునే ఆహార పదార్థాలలో ఉప్పును వాడటం వల్ల ఈ పోషకాలు మన శరీరానికి అందుతాయి. అయితే ఉప్పు ఎంత పరిమాణంలో వాడాలి అనే విషయం మన రుచికి అనుగుణంగా ఉంటుంది. అలాగే మనం ఆహార పదార్థాలలో ఉపయోగించే ఉప్పు సరైనదా కాదా అనే విషయాలను కూడా తెలుసుకోవాలి.
Also read:నా భర్త మాటల వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న: ప్రియమణి
సాధారణంగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు అయోడైజ్డ్ ఉప్పు కంటే బ్లాక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ ఉపయోగించడం మంచిది. అయోడైజ్డ్ ఉప్పులో మనకు కేవలం సోడియం మాత్రమే లభిస్తుంది.అదే బ్లాక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్ ను ఉపయోగించినప్పుడు అందులో మనకు సోడియంతో పాటు పొటాషియం కూడా పుష్కలంగా మన శరీరానికి లభిస్తుంది కనుక రక్త పోటు సమస్యతో బాధపడే వారు ఎక్కువగా బ్లాక్ సాల్ట్, రాక్ సాల్ట్ ఉపయోగించడం ఎంతో ఉత్తమం.
Also read:మరోసారి నగ్నంగా రెచ్చిపోయిన కియారా.. ఫోటోలు చూస్తే?
అదేవిధంగా రక్తపోటు సమస్యతో బాధపడేవారు వీలైనంతవరకూ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు మనలో ఉన్న సోడియం పై ప్రభావం చూపిస్తాయి. అదేవిధంగా పొటాషియం నిష్పత్తిని అలాగే మన శరీరంలో నీటి సమతుల్యతని ప్రభావితం చేయటం వల్ల మనలో అధిక రక్తపోటు కలగడానికి కారణం అవుతుంది కనుక వీలైనంత వరకు ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చేత ఈ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు. అదేవిధంగా సరైన నిద్ర నిద్ర పోవడం ఇంట్లోనే తయారు చేసుకున్న పచ్చళ్ళు, అప్పడాలను తినడం ద్వారా ఈ విధమైనటువంటి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.