- Advertisement -
కంటెంట్ ఉంటే చిన్న సినిమాలను ఆదరిస్తారని నిరూపించుకున్న మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో సుహాస్, శివాని జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది,
జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంయుక్త నిర్మాణంలో తెరకెక్కగా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఇక తాజాగా ఇప్పుడు ఓటీటీలోనూ రిలీజ్కు రెడీ అయింది. మార్చి 1 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. ఓ ఊళ్ళో అక్క తమ్ముళ్లు , ఆ ఊరి పెద్ద మధ్య జరిగిన ఆత్మగౌరవం పోరాటం, దీనికి లవ్ స్టోరీని జోడించి అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు.