స్టార్ హీరోల నుంచి వెండితెరకు ఎంట్రీ ఇస్తున్న కొత్త హీరోల వరకు, భారీ బడ్జెట్ సినిమాలతో పాటు తక్కువ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ.. బాక్సాఫీస్ వద్ద హిట్ కొడుతున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా “షాదీ ముబారక్” అంటున్నాడు. ఆయన అలా చెప్పడం ఏంటీ అనుకుంటున్నారా? అదేనండి ఆయన నిర్మాణంలో వస్తున్న కొత్త మూవీ.
దిల్రాజుతో పాటు శిరీష్లు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ, కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ఇందులో వీర్సాగర్, దృశ్యా రఘునాథ్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా వచ్చే నెల 5న (మార్చి 5న) విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రసాద్ ల్యాబ్స్ లో షాదీ ముబారక్ ట్రైలర్ను దిల్ రాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2020లో కోవిడ్-19 కారణంగా సినిమాలు రావడం తగ్గిపోయింది. కానీ 2021లో చిన్న పెద్ద సినిమాలు వరుస పెట్టి విడుదల అవుతున్నాయి. నేటి పరిస్థితి 90లో ప్రతివారం రెండు మూడు సినిమాలు విడుదలైన రోజులను గుర్తుకు తెస్తున్నాయి అని అన్నారు. ఈ సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. ఇందులోని సన్నివేశాలు అందరినీ అకట్టుకుంటాయనీ, సంగీతం సైతం చాలా బాగుందని దిల్రాజు తెలిపారు.
సోషల్ మీడియాపై కేంద్రం చర్యలను సమర్థించిన విజయశాంతి
పహిల్వాన్లతో పవర్ స్టార్ ఫైట్ !
అల్లరి నరేష్ తో దిల్ రాజు సినిమా !