Saturday, April 20, 2024
- Advertisement -

సోష‌ల్ మీడియాపై కేంద్రం చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించిన విజ‌య‌శాంతి

- Advertisement -

తాజాగా సోష‌ల్ మీడియా, ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌కు సంబంధించి కేంద్రం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను తెలంగాణ‌ బీజేపీ మ‌హిళా నేత‌, ప్ర‌ముఖ సినీ న‌టి విజ‌య‌శాంతి స‌మ‌ర్థించారు. దీనిపై ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. ఒక‌ దారి, తెన్ను… సరైన విధి విధానాలు లేకుండా సాగుతున్న సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫాం కంటెంట్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను స్వాగతిస్తున్నాను ట్వీట్ చేశారు.

వ్యక్తి స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ పేరిట విద్వేషాన్ని రగిల్చే రాతలు, వీడియోలు ఇటీవలి కాలంలో పెచ్చుమీరిపోయాయి. వీటి కారణంగా ఎందరో వ్యక్తులు, కుటుంబాలు వేదనకు గురయ్యే పరిస్థితి నెలకొంద‌న్నారు. నియంత్రణలేని సోషల్ మీడియా, ఓటీటీ తదితర కంటెంట్ వల్ల పలు సందర్భాల్లో వ్యవస్థల ఉనికి ప్రమాదంలో పడటమే గాక, ఒక్కోసారి అది దేశ ఐక్యతకు సైతం ముప్పుగా మారుతోంది తెలిపారు.

మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించి మహిళలపై వేధింపులకు పాల్పడే ఆకతాయిల సంఖ్య పెరిగిపోయింది. ఈ విషయమై గతంలో నేను పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాను. ఇలాంటి పరిస్థితులను కఠినంగా నియంత్రించేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు అన్ని వర్గాలకూ శ్రేయస్కరమని నేను నమ్ముతున్నాను.

పహిల్వాన్లతో ప‌వ‌ర్ స్టార్ ఫైట్ !

అల్లరి న‌రేష్ తో దిల్ రాజు సినిమా !

ప‌వ‌న్ సినిమాకు అలీ పెట్టుబ‌డి?

మెదడు ప‌నితీరు మెరుగు ప‌డాలంటే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -