జబర్దస్త్ షోతో బాగా ఫాపులర్ అయ్యింది హాట్ యాంకర్ అనసూయ. ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయకి బుల్లితెర మీద వెండితెర మీద ఎంతో క్రేజ్ ఉంది. ప్రస్తుతం తనకు ఉన్న క్రేజ్ తో కాసులు బాగానే సంపాధిస్తోంది. బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్ గా మారిన అనసూయ… వెండితెరపై కూడా పెద్ద మొత్తంలోనే డిమాండ్ చేస్తోంది.
సోగ్గాడే చిన్నినాయనా, క్షణం చిత్రంలో నటించిన అనసూయకు ఈ సినిమాల ద్వారా మంచి క్రేజ్ రావడంతో సినిమా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. దాంతో అనసూయ ఏకంగా తన రేటు రూ.50 లక్షలకు పెంచేసిందట. తనకి రూ.50లక్షలు ఇవ్వగలిగే వారు మాత్రమే కథ చెప్పేందుకు రావాలని అన్నట్టు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. అనసూయ ఈ రెంజ్ లో రేటు చెప్పేసరికి నిర్మాతలు షాక్ అవుతున్నారట.
రాశిఖన్నాలాంటి హీరోయిన్లే… రూ. 25 లక్షలకి నటిస్తుంటే, అనసూయ అంత డిమాండ్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకి కూడా అనసూయ జవాబు చెపుతోంది. తాను బుల్లితెరపై ఒక్క ఎసిపోడ్కి రూ.లక్ష తీసుకుంటుంటే… సినిమా చేసేందుకు రూ.50 లక్షలు తీసుకోవడంలో తప్పేంటని ప్రశ్నిస్తోంది.తాను అడిగినంత ఇవ్వకపోతే సినిమాలో నటించేది లేదు అని తెగేసి చెపుతోంది.
Related