అనసూయ యాంకర్గా తక్కువ కాలంలోనే తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. ప్రముఖ టీవీలో ప్రసారమైయ్యే జబర్దస్త్ షో ద్వారా అనసూయ బాగా పాపులరిటీ తెచ్చుకుంది. ఇక వరసగా సినిమాలలో అవకాశాలు రావడంతో అటు బుల్లితెర, ఇటు వెండితెరపై తన సత్తా చాటుతుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ చేసిన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యాంకర్ అనసూయకు అవకాశం వచ్చినట్లు సమాచారం.
అనసూయను ఒక ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నారట. కర్నూలు జిల్లాలోని ఒక పవర్ఫుల్ లేడి క్యారెక్టర్ లో ఆమె కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను మమ్ముంటి నటిస్తున్న సంగతి తెలిసిందే.