Wednesday, May 15, 2024
- Advertisement -

అభిమాని మరణ వార్తతో భావోద్వేగానికి గురైన ..విజయ్!

- Advertisement -

టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండకు యూత్ లో ప్రత్యేకమైన క్రేజ్ వుంది.సినీ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలతో స్టార్ హోదా పొందిన హీరోల్లో ఒకరిగా చెప్పవచ్చు.విజయ్ దేవరకొండ తెలుగులో అర్జున్ రెడ్డి మూవీ ద్వారా పరిచయం అయ్యి “గీతగోవిందం”, “టాక్సీవాలా” వంటి బ్లాక్ బాస్టర్ హిట్ మూవీలతో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.

హీరో విజయ్ దేవరకొండ తన అభిమాని హేమంత్ అంతుచిక్కని వ్యాధితో బాధ పడుతున్నాడని తెలుసుకుని వీడియో కాల్ ద్వారా మాట్లాడి అతనికి టీ షర్ట్స్, గిఫ్ట్స్ కూడా పంపారట. తన అభిమాన నటుడు తనను పరామర్శించడంతో ఎంతో సంతోషించారట హేమంత్. తాజాగా తన అభిమాని హేమంత్ మృతి చెందాడనే విషయం తెలుసుకొని విజయ్ భావోద్వేగం చెందారు. అంతేకాదు అప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొని నీతో మాట్లాడిన ఆ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు.

Also read:బాలయ్యతో సినిమాకు అనిల్ రావిపూడి ఎన్ని రూ. కోట్లు పెడుతున్నాడో తెలుసా?

క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘లైగర్‌’ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్‌ ఇండియా లెవెల్ లో నటిస్తున్నాడు.ఈ పాన్‌ ఇండియా సినిమా సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ హిందీ, కన్నడ మలయాళీ భాషాల్లో విడుదలకానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను కమిట్ అయ్యారని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Also read:అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మరో బ్యూటీకి అవకాశం.. కథ అంత ఆమె చుట్టే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -