Sunday, May 5, 2024
- Advertisement -

టాలీవుడ్‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేసిన యాంక‌ర్ లాస్య‌!

- Advertisement -

యాంక‌ర్ లాస్య త‌న‌కుంటు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ సొంతం చేసుకుంది. ప‌లు టివి షోల‌కు యాంక‌ర్‌గా ప‌నిచేసింది లాస్య. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న‌ప్పుడే పెళ్లి చేసుకుని యాంక‌రింగ్ మానేసింది. అయితే అమెరికాలో సెక్స్ రాకెట్ బ‌య‌ట ప‌డ‌టం,ఇందులో ప్ర‌ముఖ తెలుగు హీరోయిన్స్‌,యాంక‌ర్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సెక్స్ రాకెట్‌ను స్వ‌యంగా తెలుగు నిర్మాతే న‌డ‌ప‌డంతో ఇందులో చాలామంది ఉంటార‌నే అనుమానం అందరిలోను ఉంది. సెక్స్ రాకెట్‌ పై లాస్య స్పందించింది. టాలీవుడ్ సెక్స్ రాకెట్‌పై యాంకర్ లాస్య సంచలన వ్యాఖ్యలు చేసింది.

అమెరికాలో ఇండియా వాళ్లు అంటే చిన్న చూప‌ని పైగా మీడియాలో ప‌ని చేస్తున్నాము అంటే ఇంకా చుల‌క‌న‌గా చూస్తార‌ని చెప్పుకొచ్చింది.న్యూజెర్సీకి చెందిన ఒకాయన పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఫేస్‌బుక్‌లతో ఫొటోలు, వీడియోలు దిగి పెడతాడు. పెద్ద పెద్ద యాంకర్లతో పడుకున్నానని నాతో చెప్పాడు. నువ్వుంత ఆఫ్ట్రాల్. నా దగ్గరికి రాకపోతే అమెరికాలో నువ్వెప్పుడూ స్టేజి ఎక్కలేవు అని నన్ను బెదిరించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత వరకూ ఒక్క ఈవెంట్‌కు వెళ్లలేదు. నా పిల్లలు, భర్తతో దిగిన ఫొటో చూసి ఒక డైరెక్టర్ నన్ను సంప్రదించారు. మెసేంజర్‌లో మెసేజ్ పెట్టారు. మీరు చాలా బాగున్నారు, సినిమాల్లో ఎందుకు ట్రై చేయొద్దని నన్ను, మా వారిని కన్విన్స్ చేశారు. మిడిల్స్ కనిపించేలా ఫొటోలు పెట్టమన్నారు. ఇది అంత టాలీవుడ్‌లో కొంద‌రి వ‌ల్ల ఇలా జ‌రుగుతుంద‌ని వాపోయింది. కొంద‌రి వ‌ల్ల ఆర్టిస్ట్‌ అంద‌రిని అదేవిధాంగా చూస్తున్నార‌ని, ఇది చాలా త‌ప్పు అని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -