Tuesday, April 30, 2024
- Advertisement -

కారు ప్ర‌మాదంలో యాంక‌ర్ ర‌ష్మి

- Advertisement -

తెలుగు ప్ర‌ముఖ యాంక‌ర్ ర‌ష్మి గౌత‌మ్ కారుకు ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. యాంక‌ర్ ర‌ష్మి ఇటీవ‌లే ఓ కొత్త కారును కొనుగొలు చేసింది. ఈ కారును తీసుకుని త‌న స్వ‌స్థలం అయిన వైజాగ్ వెళ్ల‌గా , అక్క‌డ ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ర‌ష్మి కారు ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లా గాజువాక కూర్మన్నపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని రష్మి కారు ఢీకొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్ర‌మాదం ఆదివారం రాత్రి 11 సమయంలో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాద స‌మ‌యంలో ర‌ష్మినే కారు న‌డుపుతున్న‌ట్లు స‌మాచారం.

కారులో ర‌ష్మి ఒక‌రే ఉన్న‌ర‌ని తెలుస్తోంది.గాయపడిన వ్యక్తిని వెంట‌నే దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్ర‌మాదం జ‌రిగిన వ్య‌క్తి పరిస్థితి ఆందోళనకరంగా విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ సంఘ‌ట‌న‌తో ర‌ష్మి చిక్కుల్లోప‌డిన‌ట్లు అయింది. తెలుగులో ర‌ష్మికి మంచి క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. యాంక‌రింగ్‌తో పాటు ప‌లు సినిమాల‌లో న‌టిస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -