ప్రముఖ టాలీవుడ్ సింగర్ సునీత తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో మధురమైన గీతాలను ఆలపించి ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.సునీత ఈ మధ్య రెండో వివాహం చేసుకోవడంతో సోషల్ మీడియాలో అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే సునీత రెండో వివాహం తరువాత సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం సునీత సింగర్ గా రాణిస్తూనే , జీ తెలుగు చానెల్లో డ్రామా జూనియర్స్ ప్రోగ్రాం ద్వారా తన అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతున్నారు.
ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఎంతటి భయాందోళనలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి తరుణంలో సునీత తన గొంతును వినిపిస్తూ కాసేపైనా అందరిలోనూ మానసిక ప్రశాంతతను కలిగించే ప్రయత్నం చేశారు.ఇలా ప్రతీ రోజూ ఓ అర్ధగంట సమయం కేటాయిస్తానని సునీత చెప్పుకొచ్చారు.
Also read:బాలకృష్ణ సరసన ఆ బ్యూటీ.. సినిమాలో కీలక పాత్ర!
అనుకున్న విధంగా ప్రతీ రోజూ రాత్రి ఎనిమిది గంటలకు సునీతో లైవ్ లో తన ఫాలోవర్లతో తన విషయాలను షేర్ చేసుకుంటూ, అభిమానులు అడిగిన పాటలను ఆలపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మాత్రం సునీతను వాట్సప్ నంబర్ చెప్పమని అడిగేశాడు. దీంతో సునీత నవ్వుతూనే స్వీట్గా తిరస్కరించేశారు. సో సారీ అండి అంటూ ఆ మాటలు దాటవేసే ప్రయత్నం చేశారు.
Also read:సోనూ సూద్ ఫౌండేషన్ కు సారా అలీఖాన్ భారీ విరాళం.. ఎంతంటే?