శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబినేషన్లో ఓ పాన్ఇండియా మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్టోరీ డిస్కషన్ పూర్తయ్యింది. ఈ సినిమాలో ధనుష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న ఓ తమిళ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల, ఈ చిత్ర నిర్మాతలు ధనుష్ ని కలిశారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది. ధనుష్ కూడా ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడు. దాంతో పాటు ఓ తమిళ సినిమాలో తన సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ధనుష్, శేఖర్ కమ్ముల ఫ్రీ అయ్యాక .. కొత్త మూవీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ధనుష్ కాల్షీట్లు ఇచ్చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో ధనుష్తో పాటు మరో స్టార్ హీరో ఉంటాడని తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతుంది కాబట్టి.. బాలీవుడ్ లేదా టాలీవుడ్ హీరోను పెట్టే చాన్స్ ఉందని సమాచారం. అందరికీ పరిచయమైన నటుడిని ఇందుకోసం ఎంపిక చేసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.
Also Read: కేజీఎఫ్ రూట్ లోనే సలార్ కూడా…!
ఇందు కోసం దర్శకనిర్మాతలు ధనుష్ తో చర్చించినట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన ఫిదా సూపర్ హిట్ అయ్యింది. ఇక మరో మూవీ లవ్స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది.
Also Read: టాలీవుడ్ లో ఏం జరుగుతోంది.. చాప కింద నీరులా తమిళ తంబీలు..!