- Advertisement -
మజ్ను సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచియమైన అను ఇమ్మాన్యూల్ అనతి కాలంలోనే టాప్ హీరోయిన్గా పేరు సంపాదించింది.పవన్ కల్యాణ్,అల్లు అర్జున్ వంటి స్టార్ల పక్కన హీరోయిన్గా నటించింది.అయితే గత కొంత కాలంగా వ్యక్తిగత కారణాలతో సినిమాల నుండి తప్పుకుంటుంది.రవితేజ సినిమా నుండి తప్పుకున్న ఈ భామ సరిగ్గా షూటింగ్ కూడా రావడం లేదని సమాచారం.
తాజాగా ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాలో హీరోయిన్గా చేస్తుంది.అను ఇమ్మాన్యూల్ దగ్గర ఈ సినిమా తప్ప మరో సినిమా లేదు.