యువ కథానాయికలలో మలయాల క్యూట్ గర్ల్ అనుపమ పరమేశ్వరన్ కి క్రేజ్ అంతా ఇంతా లేదు. తెలుగు తెరకి పరిచయమవుతూనె లక్కీ హీరోయిన్గా మంచి మార్కులే కొట్టేసి అందరిని ఆకట్టుకుంది. వరుస విజయాలను సాధిస్తూ వెళుతోన్న ఆమె, ఈ నెల 27వ తేదీన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఇంటర్వూలో తన మనసులోని మాటను బయటపెట్టింది.
ఏహీరోయిన్ కైన స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోతో నటించాలనె కోరిక ఉండటం సహజం. అనుపమ మాట్లాడుతూ రాజమౌళి సినిమాలో ఒక్క సీన్ అయినా చేయాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. చిరింజీవినికూడా ఓరేంజ్లో పొగిండింది.
ఖైదీ నెంబర్ 150 సినిమా చూశానని చిరంజీవి ఈ వయసులో ఆ స్థాయిలో డాన్స్ చేయడం .. ఫైట్స్ చేయడం చూసి షాక్ అయ్యాను. ఆయన సినిమాలో ఒక నిమిషం నిడివి గల పాత్ర కోసం పిలుపొచ్చినా వెంటనే వెళతాను” అంటూ చెప్పుకొచ్చింది. రాజమౌళి .. చిరూ సినిమాల్లో చేయాలనే అమ్మడి కోరిక ఎప్పటికి నెరవేరుతుందో.