Friday, March 29, 2024
- Advertisement -

బిడ్డను అదిమిపట్టుకున్న అనుష్క శర్మ.. ఫొటోగ్రాఫర్లు దారుణంగా?

- Advertisement -

భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలు 2017 డిసెంబర్‌లో ఘనంగా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఈ ఏడాది జనవరి 11న విరుష్క జంట తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే.పాప పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను షేర్ చేసి చిన్నారి పేరు వామికాగా వెల్లడించారు. ఈ జంట సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తమకు సంబంధించిన విషయాలను పంచుకోవడం జరుగుతుంది. అయితే పాపకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేయలేదు ఈ జంట.విరాట్ కోహ్లీతో కలిసి అనుష్క శర్మ కూడా అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ లకు హాజరవుతోంది.

తాజాగా ఇంగ్లాండ్ టూర్‌కి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి భార్య అనుష్క శర్మ, కూతురు వామికా కూడా వెళ్లారు. బుధవారం రాత్రి ఇంగ్లాండ్‌కి స్పెషల్ ఛార్టెర్ ప్లైట్‌లో బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో విమానాశ్రయం వెలుపల టీమిండియా బస్ దిగిన అనుష్క శర్మ, తన కూతురు వామికా ముఖం మీడియా కంట పడనీయకుండా గట్టిగా అదిమిపట్టుకుని లోపలకి వెళ్లింది. అనుష్క కనీసం పాప వామికాకి ఊపిరి పీల్చుకునే స్వేచ్ఛనివ్వు అంటూ విరుష్క జోడీపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు .

Also read:క్రాక్ టీమ్ ఇచ్చిన సర్ప్రైజ్ చూశారా.. ఎంత బాగుందో?

వాస్తవానికి తన కుతురు వామికా ఫొటోలను మీడియాకి ఇవ్వబోమని గత వారం విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. వామికాని సోషల్ మీడియాకి దూరంగా ఉంచాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపిన విరాట్ కోహ్లీ.. ఆమె సోషల్ మీడియా గురించి అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాన్ని తనకే వదిలేస్తామన్నాడు. అనుష్క సినీ కెరవిషయానికి వస్తే హీరోయిన్‌గా, నిర్మాతగా రాణిస్తున్నారు. అలాగే లాక్‌డౌన్‌ సమయంలో పాతాళ్ లోక్, బుల్‌బుల్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు.

Also read:30 ఏళ్ల ఇండస్ట్రీ అంటున్న సీరియల్ హీరో.. ఎవరంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -