- Advertisement -
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకుంది.ఆసియా 30 అండర్ 30 -2018 పేరిట ప్రకటించిన ఈ జాబితాలో అనుష్క శర్మతో పాటు హైదరాబాద్ క్రీడాకారిణీ అయిన పీవీ సింధుకు కుడా స్థానం దక్కడం విశేషం.వినోద, వాణిజ్య, వెంచర్ క్యాపిటల్, రిటైల్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్లు వంటి పలు రంగాల నుంచి పలువురిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది.
ఆసియాలో 30 సంవత్సరాల వయసులోపున్న వివిధ రంగాల్లో సత్తా చాటిన 300 మంది ఎంటర్ప్రెన్యూర్లు, ఇన్నోవేటర్ల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది.ఇంకా జాబితా ఇండియాకు సంబంధించిన వివిధ రంగాలకు చెందిన వారు ఉన్నారు. వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.