ప్రభాస్, అనుష్క శెట్టి బంధం ఈనాటిది కాదు. ప్రభాస్తో దాదాపు నాలుగైదు సినిమాలు చేసింది. దీంతో అనుష్కకు, ప్రభాస్కు మధ్య ఏదో బంధం ఉందని తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. ఇద్దరు ఒడ్డుపొడువు ఒకే తీరున ఉంటారు. దాంతో అందరూ ఆ విధంగా అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన బాహుబలి రెండు సినిమాలు మెరిశారు. బాహుబలి కన్క్లూజన్లో ప్రభాస్ వీపుపై అనుష్క నడుచుకుంటూ వెళ్లడంతో వీరిద్దరి మధ్య ఆ విధంగా పుకార్లు రావడానికి కారణమైంది. ఇప్పుడు ఆ వార్తలకు బలం తీసుకొస్తూ అనుష్క, ప్రభాస్లు ప్రవర్తిస్తున్నారు.
మొన్న భాగమతి టీజర్ను అభినందిస్తూ ప్రభాస్ ట్వీట్ చేస్తూ స్విటీని తెగ పొగిడేశాడు. అది మరవక ముందే సాహో సెట్స్కు అనుష్క వెళ్లింది. సాహో సెట్స్లో దేవసేన సందడి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. సాహో షూటింగ్ చూడాలని అనుష్క సెట్లోకి వచ్చింది. చాలాసేపు అక్కడే గడిపింది. షూటింగ్ అనంతరం దర్శకుడితో కలిసి ఒక సెల్ఫీ కూడా దిగింది. నటుడు మురళీ శర్మ, కెమెరామాన్ మదితో ఫొటో దిగింది. ప్రస్తుతం అనుష్క భాగమతి సినిమా చేస్తోంది. ఈ సినిమా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్.