Saturday, April 20, 2024
- Advertisement -

మహేష్ బాబుకు గిఫ్ట్ ఇచ్చిన సీఎం జగన్

- Advertisement -

మహేష్ బాబు హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. జనవరి 11 ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తుండగా.. రష్మీక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే అందరు పాజిటివ్ గా ఉన్నారు.

ఈ నేపథ్యంలో హీరో మహేష్ బాబు అభిమానులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డీ అదిరిపోయే గిఫ్ట్ అందించారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించి రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో జనవరి 11 నుంచి 17 వరకు రెండు షోలు అదనంగా వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఏపీ సర్కారుకు లేఖ రాయగా స్పందించిన సర్కారు అనుకులంగా స్పందించి శుభవార్త చెప్పింది. ఈ నిర్ణయంతో పండుగ పూట సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు దక్కనున్నాయి. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -