శ్రీదేవి కూమార్తె జాన్వీ కపూర్ త్వరలో ధడక్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచియం కానుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.అయితే ఈ తనను తాను ప్రమోట్ చేసే పనిలో ఓ ఫోటో షూట్లో పొల్గొంది జాన్వీ.ఈ ఫోటో షూట్లో కాస్తా హాట్గానే కనిపించింది జాన్వీ.ఈ ఫోటోలు బాగానే వైరల్గా మారాయి.దీంతో జాన్వీపై చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి.
తల్లి చనిపోయిన బాద లేకుండా ఇలాంటి ఫోటోలు దిగడం ఏంటీ అనే కామెంట్స్ వచ్చాయి.పైగా ఓ ఆంగ్ల పత్రిక జాన్వీపై నెగిటివ్ వార్త ప్రచురించింది.దీంతో జాన్వీ అన్న హీరో అర్జున్ కపూర్కి చిర్రెత్తుకొచ్చింది. విమర్శకులకు మీడియా ఇంతటి ప్రాధాన్యం ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని సెటైరికల్ కామెంట్ పెట్టారు. తన చెల్లిపై వచ్చిన కామెంట్స్కు హీరో స్పందిచడం చూసి అందరు మురిసిపోతున్నారు.ఎందుకంటే అర్జున్ కపూర్ బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు , జాన్వీ కపూర్ రెండువ భార్య శ్రీదేవి కూమార్తె .
శ్రీదేవి మరణానికి ముందు వీరి మధ్య సంబంధాలు పెద్దగా ఉండేవి కావు. అర్జున్ కపూర్కు శ్రీదేవి అంటే పెద్దగా నచ్చేది కాదు.తన తండ్రిని తమ నుండి దూరం చేసారని వారిపై కోపంగా ఉండేవాడు. అయితే శ్రీదేవి మరణం తరువాత అర్జున్ కపూర్లో చాలా మార్పు వచ్చింది.జాన్వీ కపూర్ను తన సొంత చెల్లెలుగా భావిస్తున్నాడు.తనకు ప్రతి విషయంలో తోడుగా ఉంటున్నాడు.ఇప్పుడు అర్జున్ కపూర్ తన ఇద్దరి చెల్లల్ని అపురూపంగా చూసుకుంటున్నాడు.