Sunday, May 5, 2024
- Advertisement -

సందీప్ రెడ్డి తదుపరి సినిమా ‘బాహుబలి’ రేంజ్ లో ఉండబోతోందా?

- Advertisement -

‘అర్జున్ రెడ్డి’ వంటి పాత్ బ్రేకింగ్ సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయమైన టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం అదే సినిమాను బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ అనే పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసింది. తెలుగులో విజయ్ దేవరకొండ, శాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రీమేక్ హిందీ రీమేక్లో షాహిద్ కపూర్ మరియు కియారా అద్వానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి ఎలాంటి సినిమా చేయబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం సందీప్ మరొక హిందీ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ‘బాహుబలి’, ‘కే జి ఎఫ్’ వంటి పాన్ ఇండియన్ సినిమాలు బయటకు వస్తున్న ఈ తరుణంలో సందీప్ రెడ్డి కూడా ఒక పాన్ ఇండియన్ సినిమాతో మన ముందుకు రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా ఒక క్రైమ్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో సందీప్ రెడ్డి మహేష్ బాబు తో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి ఈ మధ్యనే రియాక్ట్ అయిన సందీప్ రెడ్డి మహేష్ కు తాను ఈ మధ్యనే ఒక స్క్రిప్ట్ వినిపించానని కానీ మహేష్ రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. మరోవైపు విజయ్ దేవరకొండ తో కాంటాక్ట్ లో ఉన్న ఈ దర్శకుడు కొత్త ప్రాజెక్టు గురించి డిస్కస్ చేయలేదని వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -