Tuesday, May 14, 2024
- Advertisement -

కట్టప్ప శివుడు కి చెప్పిన కథ ఇదే…!

- Advertisement -

బాహుబలి మొదటి భాగంలో కట్టప్ప అమరేంద్ర బాహుబలి ని వెన్ను పోటు పోడిచనని చెప్పటం తో అక్కడితో మొదటి భాగం కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత కట్టప్ప మిగిలిన స్టోరీ శివుడు ( ప్రభాస్ ) కి చెబుతాడు. కాలకేయ రాజ్యం మీద గెలిచి విజయ జెండా ఎగరవేసిన మహిస్మతి రాజ్యానికి రాజు గా అమరేంద్ర బాహుబలి అవుతాడు.

మరో వైపు భల్లలా దేవా కి అన్యాయం జరిగింది అని బిజ్జల దేవ్ (నాజర్ ) రగిలి పోతారు. బాహుబలి పాలనా లో మహిస్మతి చాలా బాగుంటుంది. మహిస్మతి రాజ్యానికి కి దగ్గర లో వున్నా కుంతలా రాజ్యం మీద చిన్న చిన్న రాజ్యాలు దండెత్తు వుంటాయి. కుంతలా రాజ్యాని ఎలాప్పుడు కాపాడుకొనే దేవసేన (అనుష్క ) ఆ రాజ్యం లో దేవసేన చెప్పిందే చట్టం…శత్రువు బలగాలు ని ఒంటి చేత్తో మట్టి కరిపించే ధైర్య శాలి. ఒక అనుకోని సంఘటన లో దేవా సేన ని అమరేంద్ర బాహుబలి చూడటం తో అక్కడ నుండి వాళ్ళ మధ్య ప్రేమ మొదలు అవుతుంది. మరో వైపు ఆ విషయం తెలుసుకున్న భల్లలా దేవా కూడా అనుష్క ని ఇష్టపడతాడు. 

ఈ విషయం తెలుసుకున్న బిజ్జలా దేవ్ కుంతల రాజ్యానికి వర్తమానం పంపిస్తాడు.. కానీ దేవా సేన నిరాకరిస్తుంది. బిజ్జలా దేవా శివగామి తో నీ సోంత కొడుకు అయిన భల్లలా దేవా కి రాజు ని చేస్తావని ఆ రోజు అన్నావు…. కానీ మాట తప్పవు.. ఇప్పుడు మన కొడుకు కి ఇష్టమైన ఆ దేవా సేన ని కూడా నువ్వు పెంచిన అమరేంద్ర బాహుబలి ఇష్టపడుతున్నాడు అని తన లో వున్నా భాద ని శివగామి కి చెబుతాడు. 

శివగామి ఏనిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. మరో వైపు మహిస్మతి రాజ్యం చేతి లో ఓడిపోయినా కలకెయ్య తమ్ముడు నింజా (చరణ్ దీప్) పగతో రగిలిపోతుంటాడు. కుంతలా రాజ్యం నుండి విదేయుడు (సుబ్బరాజు ) వర్తమానాని మహిస్మతి రాజ్యానికి తీసుకువస్తాడు. బిజ్జల దేవా పంపిన వర్త మానని కుంతల రాజ్యం దేవసేన తండ్రి తిరస్కరిస్తునట్టు విదేయుడు చెబుతాడు. ఆ సభలో భల్లలా దేవా కోపం తో విదేయుడు మీద దాడి చెయ్యటానికి దిగుతాడు. ఆ సమయం లో అమరేంద్ర బాహుబలి విదేయుడి (సుబ్బరాజు) కి అడ్డ వచ్చి విదేయుడిని కాపాడుతాడు. 

బిజ్జలా దేవా ఆ సభ లో మళ్ళి ఆ గొడవ ని రేపుతాడు. శివగామి అక్కడ జరుగుతుంది అంత చూస్తూ వుంటుంది. ఈ విషయం నా తల్లి శివగామి కి వదిలేస్తున్నానుఅని అమరేంద్ర బాహుబలి అంటాడు… సభ లో అంత శివగామి తీర్పు కోసం అందరు ఎదురు చూస్తూ వుంటారు. శివగామి రాజ్యం కావాలా ….! ప్రేమ కావాలో …..! తేల్చుకోమని ఆ నిర్ణయని అమరేంద్ర బాహుబలి కి వదిలేస్తుంది. 

అమరేంద్ర బాహుబలి ప్రేమ కావాలని కోరుకుంటాడు. బాహుబలి మహిస్మతి ని వదిలి అరణ్య వాసం పడతాడు. ఆ విషయం తెలుసుకున్న దేవసేన బాహుబలి కి తోడూ గా వెళ్తుంది. 

బాహుబలి దేవసేన ని పెళ్లి చేసుకుని జీవనం కొనసాగిస్తూ వుంటాడు. మహిస్మతి రాజ్యంను భల్లలా దేవా పాలిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న కలకెయ్య రాజ్యానికి రాజు అయిన నింజా (చరణ్ దీప్) మహిస్మతి రాజ్యం మీద దాడి చెయ్యటానికి సువర్ణ అవకాశం దొరుకుతుంది. మరో వైపు దేవా సేన తల్లి అయ్యింది అని కుంతల రాజ్యం అందరికి తెలుస్తుంది.

కాలకెయ్య సైన్యం మహిస్మతి రాజ్యం తో యుద్దానికి సిద్దం అవుతారు. భల్లలా దేవ్ కాలకెయ్య చేతిలో నేల కూలతారు….. రాజ్యం కుప్ప కూలిపోతుంది అని తెలుసుకున్న శివగామి బాహుబలి కి వర్తమానం పంపిస్తుంది.

విషయం తెలుసుకున్న బాహుబలి బార్య తో కలసి మహిస్మతి రాజ్యానికి వస్తాడు. కుంతలా రాజ్యం మహిస్మతి రాజ్యానికి సహాయం చేస్తుంది…. మరో వైపు బిజ్జల దేవా (నాజర్ ) బాహుబలి మళ్ళి తిరిగి వస్తే తన కొడుకు ని రాజ్యం నుండి తప్పిస్తారు అని తెలిసి భల్లలా దేవా, బిజ్జలా దేవా అనుకుంటారు….. ఒక వైపు కాలకెయ్య చేతిలో ఓడిపోతాం అన్న భయం లేకుండా, తన అన్న తిరిగి వచ్చాడు అన్న భయం ఎక్కువ కనిపిస్తుంది.

బాహుబలి ని వెన్నుపోటు పొడవమని భల్లలా దేవ్, బిజ్జల దేవ్ కట్టప్ప (సత్య రాజ్) చెబుతారు. కాలకెయ్య సైన్యం తో యుద్ధం కొనసాగుతుంది…ఆ యుద్ధం లో కాలకెయ్య సైన్యం అంత కుప్పకూలుతుంది. యుద్ధం జరుగుతున్న సమయం లో బాహుబలి ని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. ఆ యుద్ధ భూమి లో బాహుబలి చనిపోతాడు.

దేవా సేన 9 నెలలు గర్భవతి అవ్వటం వలన శివగామి అన్ని దగ్గర ఉండి చూసుకుంటుంది. రానా బాహుబలి మీద వున్నా కోపం తో మహిస్మతి రాజ్యం లో వున్నా ప్రజలని హింస చూపిస్తాడు. దేవసేన ని చెరసాల లో బంధిస్తాడు. దేవసేన కి పుట్టిన బిడ్డని శివగామి పెంచుతుంది. బాహుబలి వారసుడి ని చంపాలని అనుకుంటాడు… కట్టప్ప ద్వారా ఆ విషయం శివగామి కి తెలుస్తుంది.

బాహుబలి ని తన కొడుకు  భర్త కలసి చంపించారు అని శివగామి కి తెలుస్తుంది. భల్లలా దేవా బాహుబలి కొడుకుని చంపుదామని ప్లాన్ వేస్తాడు… ఆ విషయం తెలుసుకున్న శివగామి బాహుబలి కి పుట్టిన బిడ్డ తో రాజ్యం నుండి పారిపోతుంటే భల్లలా దేవా సైన్యం శివగామి ని చంపటానికి ట్రై చేస్తుంటారు … ఆ పోరు లో శివగామి ఆ పిల్లవాడిని ఒక గుడిసె వాళ్ళకి అప్పగించి చనిపోతుంది….. అక్కడితో కట్టప్ప బాహుబలి కి జరిగిన అన్యాయం గురించి శివుడి కి చెబుతాడు.

భల్లలా దేవా శివుడు మీద పగ తో రగిలిపోతుంటాడు…. తన కొడుకు (బద్రుడు ) ని చంపినా శివుడు మీద పగ తో వున్నా భల్లాల దేవా , మరో వైపు తన భర్త (బాహుబలి) చావు కి కారణం అయిన భల్లలా దేవా ని చంపుతాను అని శబథమ్ చేసిన దేవా సేన కసి తో వుంటారు…. శివుడు తనకంటూ ఒక రాజ్యాని ఏర్పాటు చేసుకుంటాడు… ఆ రాజ్యం లో కుంతలా రాజ్యం తోడూ అవుతుంది.. శివుడి కి నమ్మిన బంటు గా కట్టప్ప వుంటే , వాళ్ళకి ఆయుధాలు సరపరా చేసే వ్యక్తిగా కిచ్చా సుదీప్ సహాయం చేస్తాడు. మహిస్మతి రాజ్యానికి, శివుడి కి మధ్య జరిగే పోరు లో మహిస్మతి రాజు అయిన భల్లలా దేవా శివుడు చేతిలో ఓడిపోతాడు.

మహిస్మతి రాజ్యం లో అందరు చూస్తుండగా భల్లలా దేవా (రానా ) ని చితి మీద పేర్చి సజీవ దహనం చేస్తుంది…..ఆ బాధ తట్టుకోలేక బిజ్జలా దేవా కోడుకు చితిని చూస్తూ కన్ను ముస్తాడు

Related

  1. బాహుబలి ఆ ? హాహాహ అంటున్న నాగార్జున
  2. నాగార్జున కి బాహుబలి కావాలట
  3. క్రికెట్ ఆడుతున్న బాహుబలి బృందం
  4. బాహుబలి గురించి షాకింగ్ సీక్రెట్! వీరికే తెలుసు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -