యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత దసరాకు కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చినబాబు నిర్మించారు.ఆదివారంనాడు శిల్పాకళ వేదికలో సినిమా సక్సెస్ మీట్ను ఘనంగా నిర్వహించారు.ఈ సక్సెస్ మీట్కు బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గోన్నారు.ఈ సంధర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ”తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన శ్రామికుడు, చైతన్య రథసారధి మా అన్నయ్య నందమూరి హరికృష్ణ మరణం నన్ను వేదనకి గురి చేసింది. దేన్నైనా ఎదుర్కొని ముందుకు సాగే ధైర్యశాలి ఆయన మనముందు లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నా.. తొలిదినాల్లో నాన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయనకి చేదోడువాదోడుగా నిలుస్తూ కొడుకుగా తన బాధ్యతలు నిర్వహించాడు.
ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్నగారి మరణాంతరం హిందూపురం ఉపఎన్నికల్లో అత్యంత మెజారిటీ 60 వేల ఓట్ల మెజారిటీ సాధించిన రికార్డ్ హరికృష్ణ గారి సొంతం. రైతులకి బాసటగా నిలిచారు.ఇక ‘అరవింద సమేత’ సినిమా సక్సెస్ మీట్ కి వచ్చిన అభిమానులకి నా అభినందనలు. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. నేను ఎన్టీఆర్ బయోపిక్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చూడలేకపోయాను. కానీ సినిమా ఇతివృత్తం అడిగి తెలుసుకున్నాను. ఆడవాళ్ళ గొప్పతనం గురించి ఈ సినిమా చెప్పారని తెలిసి నాకు లెజెండ్ సినిమా గుర్తొచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ అందంగా సినిమాని చూపించగలడు. నేను, తారక్ చేసే సినిమాలు చేయడం మరెవరి వల్ల కాదు.. లార్జర్ థాన్ లైఫ్ సినిమాలు చేస్తాం.. నవరసాలు ఉన్న సినిమాలు చేస్తాం. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు బాలకృష్ణ.