హిందూపురం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ నోరు జారడం ఇంకా మానుకోలేదు. ఇప్పటికే పలు బహిరంగ ప్రదేశాల్లో తన అభిమానులపై చేయిచేసుకోవడం వారి పట్ల దురుసుగా వ్యవహరించడం చూశాము. ఈ సారి ఏకంగా మీడియాపైనే చిందులేశారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు 25వ వర్థంతి సందర్భంగా సోమవారం బాలయ్య తన అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవరేజ్ కోసం వచ్చిన మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కారు.
బాలయ్య సోదరుడు రామకృష్ణ మాట్లాడుతున్న సందర్భంలో ‘మైక్ పెట్టు.. మైక్ పెట్టు తమ్ముడూ’.. అని మీడియా ప్రతినిధి అనడంతో.. ‘ఎక్కడా ? మైక్ పెట్టు కాదు.. మైక్ పట్టుకో అను.. నీ యబ్బా’ అంటూ సీరియస్ అయ్యారు.
అంతకు ముందు బాలయ్య మాట్లాడుతుండగా.. ‘కొంచెం ముందుకు రండి సార్.. కొంచెం వెనక్కి వెళ్లండి సార్ అని మంచి ఫ్రేమ్ కోసం మీడియా సిబ్బంది హడావిడి చేయడంతో.. ‘చాల్ చాల్లే.. మీ సలహాలు.. సూది బెజ్జం అంత సందు ఇస్తే చెవిలో ఉచ్చపోసే రకాలు మీరు’అంటూ విలేకర్లపై ఫైర్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడటం అంటే.. సూర్యుడ్ని వేలెత్తి చూపించడం లాంటిదే అని అంత ఉత్తమమైన జీవితం ఎన్టీఆర్ది అని కొనియాడారు.
‘భారతీయ సినిమా రంగంలో అగ్ర హీరోగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. తను అంత స్థాయి చేరుకోవడానికి కారణమైన ప్రజలకు ఏదైనా చేయాలనిపించి తెలుగు దేశం పార్టీని స్థాపించి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన సంఘ సంస్కర్త, ఆయన ఒక సంస్థ. మహిళలకు ఆస్థిలో సమాన హక్కును కల్పించడం, స్థానిక ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్స్ను కల్పించినా, పేదలకు కిలో రెండు రూపాయలకు బియ్యం అందించారు. శారీరకంగా ఆయన మన ముందు లేకపోయినా, స్ఫూర్తి ప్రదాతగా చిరస్థాయిగా ఉండిపోతారు. పార్టీలకు, కుల, మతాలకు అతీతుడైన వ్యక్తి ఎన్టీఆర్’అని ప్రశంసించారు.
మెగా హీరోలతో బిగ్గెస్ట్ మల్టీస్టారర్.. దర్శకుడు ఎవరో తెలుసా..?