Saturday, April 20, 2024
- Advertisement -

బండ్ల గణేష్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్..

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా కెరీర్ ఆరంభించిన బండ్ల గణేష్ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా మారారు. ఓ వైపు కమెడియన్ గా నటిస్తూనే పలు చిత్రాలుకు నిర్మాతగా వ్యవహరించారు. మద్యలో కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆ మద్య మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మళ్లీ తనదైన కామెడీ పంచారు. ఇక ఇండస్ట్రీలో బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి పరమ భక్తుడని తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన ఏ మూవీ ఫంక్షన్లో అయినా చెబుతూనే ఉంటారు.. తన భక్తి చాటుతూ ఉంటారు.

పవన్ కళ్యాణ్ తో గబ్బర్‌సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ మూవీని తీసిన ఆయన తన దేవుడితో మరో సినిమా తీయనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాన్ వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే మరోసారి వీరిద్దరి కాంబోలో ఓ సినిమా చేయబోతున్నారన్న వార్త ఫిలిమ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. బండ్ల‌ గ‌ణేశ్‌తో సినిమా చేసేందుకు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవలే తన కొడుకు అకీరా నందన్ తో కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ ఫోటోను బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసి ‘నా దేవుడుతో నా హీరో ’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే పవన్ తనయుడిని హీరోగా చూడాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ నా హీరో అంటూ పోస్ట్ పెట్టడంతో అకీరాను బండ్ల గణేష్ లాంచ్ చేయబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఇదే కనుక నిజం అయితే.. మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -