మే 11న ‘సాక్ష్యం’ విడుదల
విభిన్న సినిమాలు చేస్తూ విజయం లేకున్నా తండ్రి ప్రోత్సాహంతో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న సినిమా ‘సాక్ష్యం’. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాలో శ్రీను పక్కన పూజా హెగ్డే నటిస్తోంది. అభిషేక్ నామా నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేసుకుంటోంది.
అయితే ఈ సినిమాను వేసవి సందర్భంగా మే 11వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ డూప్ లేకుండా చేసిన యాక్షన్ సీన్స్ చేస్తున్నారు. పీటర్ హెయిన్స్ ప్రత్యేకంగా బెల్లంకొండ శ్రీనివాస్ స్టంట్స్ చేస్తున్నారు. వాటితో పాటు పూజాహెగ్డేతో రొమాంటిక్ సన్నివేశాలు తీస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. మిగతా అమెరికాలో ప్రధాన షూటింగ్ ఉండనుంది.ఈ సినిమాలో జగపతిబాబు, శరత్కుమార్, మీనా, వెన్నెల కిశోర్, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్, బ్రహ్మాజీ, రవి కిషన్, అశుతోశ్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ఆయా పాత్రల్లో నటిస్తున్నారు.