- Advertisement -
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచియమై చాలాకాలం అయిన సరైన హిట్ మాత్రం రావడం లేదు.బోయపాటి దర్శకత్వంలో జయ జానకి నాయక సినిమా తీసిన యావరేజ్గానే మిగిలింది.బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం సాక్ష్యం సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా పూర్తి కావచ్చింది.. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో ఆయన వున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డె నటిస్తుంది.శ్రీవాస్ దర్వకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా తరువాత మరో సినిమాను ప్రారంభించాడు.ఈ చిత్రాన్ని శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడు.కాజల్ కథానాయికగా నటిస్తుంది.ఈ కథ కొత్తదనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉత్కంఠ భరితంగా సాగిపోతుందట. ఓ పెద్ద సంస్థ ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుందట. ఇందుకోసం వాళ్లు 9.5 కోట్లను చెల్లించినట్టుగా సమాచారం.