Wednesday, May 22, 2024
- Advertisement -

ఫ్యాన్స్‌కి భ‌ర‌త్ అనే నేను మ‌రో హామీ… !

- Advertisement -

మ‌షేష్‌, కొర‌టాల కాంబోలో వ‌చ్చిన భరత్ అనే నేను సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల రేసులో దూసుకెళ్తున్నాడు. తొలి వారాంతంలో మహేశ్ బాబు సినిమా రూ. 120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్టు తెలుస్తోంది. గత శుక్రవారం భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకుపైగా థియేటర్లలో సూపర్ స్టార్ సినిమా విడుదలైంది. పాజిటివ్ టాక్ రావడంతో.. తొలి వారాంతంలో నాన్ బాహుబలి రికార్డులను భరత్ చెరిపేశాడు.

విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తాజాగా జరిగిన సక్సెస్ మీట్ లో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ దర్శకుడు కొరటాల శివకు రుణపడి ఉంటానని అన్నారు.’త్వరలోని ఆ ఫైట్ ను యాడ్ చేస్తామని వెల్లడించాడు.

ఫైనల్ ఎడిటింగ్ సమయంలో నిడివి కారణంగా కొన్ని మంచి సీన్స్ ను తొలగించవలసి వచ్చింది. ఆ సన్నివేశాలను త్వరలో కలపనున్నామని ఆయన అన్నారు. త్వరలో కలపనున్న ఆ సీన్స్ కు డబ్బింగ్ చెప్పించడం మొదలైనట్టు సమాచారం. ఎప్పటి నుంచి ఈ సీన్స్ ను యాడ్ చేయబుతున్నారనేది తెలియాల్సి వుంది. కొత్త సీన్స్ ను జోడించడం వలన అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -