శ్రీమంతుడు సినిమా హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్బాబు ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నాడు. ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్బాబు కనిపిస్తున్నాడు. రాజకీయాల నేపథ్యంలో సినిమా రూపొందించడంతో ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదల చేసిన టీజర్, పోస్టర్లతో క్రేజ్ ఏర్పడింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ ఓథ్ పేరుతో ఓ వీడియోని విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ ఇటీవల టీజర్ విడుదల చేశారు. దీనికి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు శ్రీరామనవమి కానుకగా ఆదివారం (మార్చి 25) తొలిపాటను విడుదల చేశారు. దేవీశ్రీ మ్యూజిక్ అందించిన ఈ పాటలో మహేశ్బాబు తాను చేసే పనిని వివరిస్తూ పాట రూపొందించారు. ‘విరచిస్తా నేడే నవశకం.. నినదిస్తా నిత్యం జనహితం’ అని పాట మొదలవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఒక ఫిక్షనల్ పొలిటికల్ డ్రామాగా ‘భరత్ అనే నేను’ రూపొందుతుంది. డీవీవీ ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్లో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. మహేశ్ పక్కన కైరా అద్వానీ హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటూ ఏప్రిల్ 20వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
Here's #TheSongOfBharat… https://t.co/oY0rt1n84u
Suny by #DavidSimon🎤
Lyrics by @ramjowrites ✍️
Music by Rockstar @ThisIsDSP 🎼
AUDIO ON @LahariMusic 🎶 @DVVEnts @sivakoratala @urstrulyMahesh— Lahari Music (@LahariMusic) March 25, 2018