Saturday, May 18, 2024
- Advertisement -

కొడుకు పిలుపుతో క‌న్నీళ్లు పెట్టుకున్న కౌశ‌ల్‌

- Advertisement -

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ చివ‌రి అంఖానికి చేరుకుంది.షో మ‌రికొద్ది రోజుల్లో ముగియ‌నుంది.ప్ర‌స్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఏడుగురు స‌భ్యులు ఉన్నారు.వీరంద‌రు 90 రోజుల‌కు పైగా ఇంటికి,కుటుంబ స‌భ్యులకు దూరంగా ఉంటు వ‌స్తున్నారు.తాజాగా వారి ఇంటి స‌భ్యుల‌ను హౌస్‌లోకి తీసుకువ‌చ్చి ఎమోష‌నల్ ట‌చ్ చేశారు బిగ్‌బాస్‌.నిన్నటి ఎపిసోడ్ లో సామ్రాట్ తల్లి, అమిత్ భార్య, కొడుకు.. అలానే దీప్తి భర్త, కొడుకు హౌస్ లోకి వెళ్లారు. వారిని చూసిన కుటుంబ సభ్యులు ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కౌశల్ ఇద్దరి పిల్లలు హౌస్ లోకి రాబోతున్నారు.

దీనికి సంబంధించిన ప్రోమో బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. కన్ఫెషన్ రూమ్ లో కూర్చొన్న కౌశల్ కొడుకు ‘పప్పా’ అని పిలవగానే కౌశల్ కి కన్నీళ్లు ఆగలేదు.ఫ్రీజ్ లో ఉన్న అతడిని బిగ్ బాస్ రిలీజ్ చేయగానే కన్నీళ్లు తుడుచుకుంటూ కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లాడు కౌశల్. అక్కడ తన ఇద్దరి పిల్లల్ని చూసుకొని మరింత ఎమోషనల్ అయ్యాడు. ఇద్దరినీ హత్తుకొని తన ప్రేమను పంచాడు. ఈ ప్రోమో చూసిన కౌశల్ అభిమానులు సంతోషంతో మాక్కూడా కన్నీళ్లు ఆగలేదంటూ స్పందిస్తున్నారు.మిగిలిన ఇంటి స‌భ్యుల‌కు సంబంధించిన ఫ్యామిలీ వారు కూడా ఈ రోజు బిగ్‌బాస్ హౌస్‌లో సంద‌డి చేయ‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -