తెలుగు బిగ్బాస్ రెండో సీజన్ మరకొద్ది రోజుల్లో ముగియనుంది.ఆదివారం జరిగిన ఎపిసోడ్లో శ్యామల ఎలిమినేట్ అయి బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.ఒక బిగ్బాస్ హౌస్లో మిగిలింది ఏడుగురు సభ్యులే. మరి ఈ ఏడుగురులో ఎవరు బిగ్బాస్ నుంచి బయటికి వస్తారో?ఎవరు బిగ్బాస్ విజేతగా నిలుస్తారో? అనే ఆసక్తి అందరిలోను నెలకొంది.
తాజాగా బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన శ్యామలపై సోషల్ మీడియలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది.బిగ్బాస్ హౌస్ నుంచి ఫస్ట్ టైం ఎలిమినేట్ అయి బయటకి వచ్చిన శ్యామల… కౌశల్ ఆర్మీ సహయంతో మళ్లీ తిరిగి బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టగల్గింది.హౌస్లో అడుగుపెట్టిన తరువాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది.బయట కౌశల్కు ఉన్న ఫాలోయింగ్ గురించి ఇంటి సభ్యులకు చెప్పి అందరిని ఎలర్ట్ చేసింది శ్యామల.గత వారం ఎలిమినష్న్లో ఉన్న శ్యామలకు ఓట్లు వేయకుండా అమీత్కు ఓట్లు వేసి ఆమెను ఎలిమినేట్ అయ్యేలా ప్లాన్ చేశారు కౌశల్ ఆర్మీ.ఎలిమినేట్ అయిన శ్యామలను టాప్ త్రీ కంటెస్టెంట్స్ లో ఎవరుంటారని అనుకుంటున్నారని నాని అడగగా దానికి గీతామాధురి, తనీష్, రోల్ రైడా పేర్లను చెప్పింది శ్యామల.
కౌశల్ పేరు చెప్పకుండా మిగిలిన కంటెస్టెంట్స్ పేర్లు చెప్పడంతో శ్యామలపై కౌశల్ ఆర్మీ విమర్శలు చేస్తోంది. రీఎంట్రీ సమయంలో తము ఓట్లు వేస్తేనే లోపలకి వెళ్లిన శ్యామల ఇప్పుడు కనీసం టాప్ త్రీ లిస్ట్ లో కౌశల్ పేరు చెప్పకుండా మిగిలిన వారి పేర్లు చెబుతుందా..? అంటూ ఫైర్ అవుతున్నారు.మరికొందరు ఒక అడుడు ముందుకేసి నువ్వు చెప్పింది వచ్చేవారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో వారి పేర్లు చెప్పావు అంటు శ్యామలకు కౌంటర్ ఇచ్చారు కౌశల్ ఆర్మీ.