Tuesday, May 7, 2024
- Advertisement -

మోసం చేస్తున్న శ్రీముఖీ.. అందుకే తగిన పాఠం..!

- Advertisement -

బిగ్ బాస్ అయిపోవడానికి కొద్ది టైం ఉండటంతో అందరిలో ఉత్కంఠ పెరిగిపోయింది. తమ ఫేవరెట్ కంటెస్టెంట్ ను గెలిపించేందుకు అందరు అన్ని రకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికితోచినట్లు వాళ్లు ర్యాలీలు, ప్లెక్సీలు కట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే బయట ఏం జరుగుతుందో లోపడ ఉన్నవారికి తెలియదు. ఇంటి సభ్యుల గురించి ఏం అనుకుంటున్నారో ఒక్క అలీకి తప్పిస్తే ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు. అయితే తాజాగా వారి గురించి ఏమనుకుంటున్నారో తెలియజేశాడు బిగ్ బాస్.

అభిమానులు రాసి పంపిన లేఖలను ఇంటి సభ్యులకు అందజేశాడు. అయితే శ్రీముఖి లేఖలో.. “ఆమె కన్నింగని, ఉమెన్ అనే సాకు బాగా చూపిస్తుందని.. జెండర్ కార్డ్ కూడా ఉపయోగిస్తుందని” ఉంది. అయితే దీనిపై స్పందించిన శ్రీముఖి.. తానెప్పుడు అలా జెండర్ కార్డును ఉపయోగించలేదని.. అలాంటి వాటికి వ్యతిరేకమని తెలిపింది. దొంగల రాణి టాస్క్ లో రవి తన చేయిను పట్టుకున్నాడని జైలుకు పంపించిన విషయం.. కెఫ్టెన్ అయ్యేందుకు మహిళలందరికీ చాన్స్ ఇచ్చిన టాస్క్ లో పరిగెత్తకుండా వదిలేసిందని ఇలా గడిచిన సంగతులను మళ్లీ గుర్తు చేస్తున్నారు.

ఇదంతా పక్కన పెడితే ఆమె తరుపున ప్రచారం చేస్తున్న ఆమె పీఆర్ టీం చేసిన ట్వీట్ పెద్ద హాట్ టాపిక్ అయింది. గత రెండు సీజన్లో మగవారే గెలిచారు. ఈ సారి ఆడవారికి ఛాన్స్ ఇవ్వాలని.. అందరు శ్రీముఖికే ఓటు వేయండి అని ట్వీట్ సారాంశం. దాంతో ఆ ట్వీట్ పై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. హౌస్ లో శ్రీముఖే జెండర్ కార్డ్ నచ్చదంటుంది. బయట మీరేమో ఇక్కడ ఉమెన్ కార్డ్ చెప్పుకుని ఓట్లు అడుగుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఇలా చేస్తే శ్రీముఖి ఎలా గెలుస్తుందని పైర్ అవుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -