బిగ్బాస్ రెండో సీజన్ ప్రారంభంలో కాస్తా నిరాశకు గురి చేసినప్పటికి తరువాత షోని ఆసక్తికరంగా మలిచి ప్రేక్షకులలోకి తీసుకువెళ్లడంలో బిగ్బాస్ టీం సక్సెస్ అయింది.షో మూడో వారం నుంచి హౌస్లో నిత్యం గొడవలు,వివాదాలు జరుగుతున్నాయి. వీటివల్లే షోకి విపరీతమైన రేటింగ్స్ వస్తున్నాయి. ఇక షో మొదటి నుంచి ఇంటి సభ్యులందరు ఒకవైపు,కౌశల్ ఒక్కడే ఒకవైపు అన్నట్లుగా సాగుతుంది.హౌస్లోని సభ్యులందరు అతనితో గొడవ పెట్టుకున్న వాళ్లే. నిజాయితిగా గేమ్ ఆడటం,తను అనుకున్న మాట మీద నిలబడి ఎంతటి కష్టన్ని అయిన భరించాడు కౌశల్.
హౌస్మెట్స్ అందరు అతనిని నిందించినప్పటికి ,బయట చూస్తున్న ప్రేక్షకులు మాత్రం అతను ఆడుతున్న గేమ్ సరైందిగా భావిస్తున్నారు. ఈ నీతి,నిజాయితిలా కారణంగానే అతనికి సోషల్ మీడియలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అతని పేరిట సోషల్ మీడియాలో ఓ ఆర్మీని క్రియేట్ చేసి అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. వీరు కౌశల్ను టార్గెట్ చేసిన ప్రతి ఒక్కరిని హౌస్ నుంచి బయటికి పంపిచేస్తున్నారు. ఇక నిన్న(ఆదివారం) అతనికి మద్దతుగా హైదరాబాద్లో 2కె రన్ ఎర్పాటు చేశారు కౌశల్ ఆర్మీ. దీనికి విపరీతమైన స్పందన రావడం గమనర్హం. దాదాపు 10 వేల మంది ఈ 2కె రన్లో పాల్గోన్నారని సమచారం. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరోకి మద్దతుగా ఇలా ర్యాలీలు చేపట్టలేదు. మొట్ట మొదటిసారిగా ఇలా టీవీ ఆర్టిస్ట్ కోసం ఇలా తమ అభిమానాన్ని చాటుకోవడం ఎంతైనా విశేషమే అని చెప్పాలి. అయితే ఈ ఆర్మీపై పలువురు నెటిటివ్ కామెంట్ప్ చేస్తున్నారు. కౌశల్ ఆర్మీని డబ్బు ఇచ్చి కొందరు నడిపిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అయితే దీనిపై కూడా కౌశల్ ఆర్మీ స్పందించింది. నిన్నటి ర్యాలీలో పాల్గోన్న వారిని ప్రశ్నిస్తే…. అన్న నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను ,మా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది. ఇద్దరం కలిసి నెలకు లక్షకు పైగా సంపాదిస్తాము. ఆదివారం చక్కగా పడుకోకుండా మాకు రోడ్ల మీద ఇలా తిరగడం సరాదా కాదని జావాబు ఇచ్చాడు. ఇది అంత కౌశల్ అన్న మీద అభిమానంతో చేస్తున్నాం. డబ్బులు కోసం కాదు,అలా చెప్పేవారికి డబ్బులు లేకపోతే చెప్పండి కౌశల్ ఆర్మీ అంతా కలిసి తలో రూపాయి వేసి ఇస్తాం అని దిమ్మతిరిగే అన్సర్ ఇచ్చారు కౌశల్ ఆర్మీ. ఇక వచ్చేవారం వైజాగ్లో కౌశల్కు మద్దతుగా 2కె రన్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.