ఈ మద్య హీరోయిన్లు మాల్దీవుల్లో సేద తీరుతున్నారు. ఈ వెకేషన్ ని సోషల్ మాద్యమాల్లో ఫోటోలు షేర్ చేస్తు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నారు. ఒకప్పట్లా సేదతీరడానికి అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్లడం లేదు మన హీరోయిన్లు. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ మేరకు మాల్దీవుల్లో రిఫ్రెష్ అవుతున్న మధుర క్షణాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు నాలుగు పదుల వయస్సులోను యూత్కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి మాల్దీవులలో రచ్చ చేస్తుంది.
తెలుగు లో టక్కరి దొంగ చిత్రంలో మహేష్ సరసన నటించిన ఈ అమ్మడు తర్వాత పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. హిందీలో జిస్మ్, ధూమ్ సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకున్న బిపాసా కొన్నాళ్లకు మోడల్ కరణ్ సింగ్ గ్రోవర్ను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఇండస్ట్రీకి పెద్దగా టచ్ లో ఉండటం లేదు.
ఎల్లో డ్రెస్లో అదరగొడుతున్న హాట్ బ్యూటీ శ్రీముఖి