Saturday, May 4, 2024
- Advertisement -

డబల్ అమౌంట్ ఇచ్చి షూటింగ్ లు కానిస్తున్నారు

- Advertisement -
Black money flow in tollywood

టాలీవుడ్‌లో సినిమాల షూటింగ్ స్పీడ్‌గా సాగుతోంది. ఒకప్పుడు నెలలకొద్దీ మూవీల చిత్రీకరణ సాగేది. మోదీ సర్కార్ 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో నల్లధనం బయటకువస్తోంది. ఈ నేపథ్యంలో తమవద్దనున్న బ్లాక్‌ని వైట్‌లోకి మార్చుకోవాలనే ఆలోచనలో నిర్మాతలు పడ్డారు.

ఇందుకు కారణాలు లేకపోలేదు.. డిసెంబర్ 30లోపు తమ దగ్గరునున్న నోట్లను మార్చుకోవచ్చుని, ఆ తర్వాత ఆధారాలతో మార్చి వరకు చేసుకోవచ్చుని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. 

ఇందులోభాగంగానే బ్లాక్‌మనీని వైట్ చేసుకునే పనిలో కొంతమంది నిర్మాతలు, ఫైనాన్షియర్లు పడినట్టు సమాచారం. ఈ క్రమంలో కొంత‌క్యాష్, వోచర్ రూపంలో టెక్నీషియన్లకు డబుల్ మొత్తాన్ని ఇస్తున్నారట. అదే నటీనటులకైతే  క్యాష్‌ ఎక్కువ.. తక్కువ మొత్తంతో చెక్కు ఇస్తున్నట్లు ఫిల్మ్‌సర్కిల్స్‌లో క్యాంపెయిన్ సాగుతోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో నిర్మాతలు ఈ పద్దతినే అనుసరిస్తున్నట్లు ఇన్‌సైడ్ సమాచారం. మరికొంతమంది ప్రొడ్యూసర్లయితే టెక్నీషియన్స్‌కి రెట్టింపు ఇచ్చి వీలైనంత వేగంగా తమ పనులు షినిష్ చేసుకోవాలని భావిస్తున్నారట. మార్చి 31లోగా తమ వద్దనున్న బ్లాక్‌ని ఈ రూపంలో వైట్ చేసుకునే పనిలోపడినట్టు చెప్పుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -