బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను చూసి.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా ప్రభాస్ తో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రభాస్ ను పిచ్చగా లైక్ చేసే జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కూడ చేరిపోయింది. చాలా కాలం నుంచి ప్రభాస్ ను కలవాలని.. ఎదురు చూస్తున్న ఈ హీరోయిన్ చివరకు అనుకున్నది సాధించింది.
టాలీవుడ్ లోని తన ఫ్రెండ్ ద్వారా ప్రభాస్ ను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఆ ప్రెండ్ ద్వారా ప్రభాస్ వ్యాక్తిగత ఫోన్ నెంబర్ సంపాదించిన కియారా ప్రభాస్ కు ఒక మేసేజ్ పెట్టిందట. ఆ మెసేజ్ చూసిన యంగ్ రెబల్ స్టార్ ఇచ్చిన సమాధానం ఈ బ్యూటీకి మరింత జోష్ ను ఇచ్చింది అని సమాచారం. ఎమ్.ఎస్. ధోని మూవీతో కియారా అద్వానీ బాలీవుడ్ లోకి ప్రవేశించిన నేపధ్యం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దర్శకుడు కొరటాల శివ ప్రిన్స్ మహేశ్బాబు కాంబినేషన్ లో త్వరలో ప్రారంభంకాబోతున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో హీరోయిన్గా ఈమెను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన.. నటించేందుకు దిశాపటానీ, పరిణితి చోప్రాతోపాటు కియారా పేరు కూడ పరిశీలనలో ఉంది. అయితే మహేష్ కియారాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల నేపధ్యంలో ఈబ్యూటీకి ప్రభాస్ పక్కన కూడ ఛాన్స్ వస్తే ఇక ఈమెకు తిరుగు ఉండదు. అందుకే కాబోలు రహస్య మెసేజ్ లు ఇస్తూ కియారా ప్రభాస్ ను బుట్టలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కియారా మెసేజ్ కు ప్రభాస్ కూడ రిప్లై ఇచ్చాడని సమాచారం అందుతున్న నేపధ్యంలో ఆ మెసేజ్ లో ప్రభాస్ ఈమెకు ఏమిచెప్పాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
Related