దేశంలో కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా వైరస్ అందరినీ ఇట్టే చుట్టేస్తుంది. ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో పలువురికి కరోనా వైరస్ రావడం.. చనిపోవడం జరిగింది. ఇక రాజకీయ నేతలు కూడా కరోనా భారిన పడి చనిపోయారు. తాజాగా బాలీవుడ్ నటుడు చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ కి కరోనా పాజిటీవ్ అని తేలింది.
ఈ విషయం అతని తల్లి నీతూ కపూర్ వెల్లడించారు. తన కుమారుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని, క్రమంగా కోలుకుంటున్నాడని వివరించారు. ‘రణబీర్ ఆరోగ్యంపై ఆందోళన వెలిబుచ్చుతున్న అందరికీ కృతజ్ఞతలు’ అంటూ నీతూ సోషల్ మీడియాలో స్పందించారు. గత ఏడాది రణబీర్ కపూర్ తండ్రి రిషీ కపూర్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
కాగా, నీతూ ప్రకటన కంటే ముందు కపూర్ కుటుంబీకులు రణబీర్ అనారోగ్యం పాలైనట్టు వెల్లడించినా, ఎందువల్ల అనారోగ్యం అనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు రణబీర్ ఇంటి వద్దే క్వారంటైన్ లో ఉంటున్నాడని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఆమె తెలిపారు.
అఖిల్ సినిమాకి ప్రమోషన్స్ మొదలపెట్టాలని ప్లాన్ చేస్తున్న చిత్రబృందం….!