Friday, April 26, 2024
- Advertisement -

బాలీవుడ్ లో విషాదం.. కరోనాతో నిర్మాత కన్నుమూత!

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా ఇండస్ట్రీలో రోజుకు కనీసం ఒకరిద్దరు ప్రముఖులు కరోనాకు బలి అవుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బాలీవుడ్ నిర్మాత రియాన్ ఇవాన్ స్టీపెన్ కరోనాతో కన్నుమూసాడు. ఇటీవల రియాన్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

అకస్మాత్తుగా ఆయన అనారోగ్యానికి గురి అయ్యారు. ఈ క్రమంలోనే మే 29న ఆయన ప్రాణాలు కోల్పోయారు. బాలీవుడ్ లో రియాన్ కు మంచి పేరు ఉంది. కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కిన ఇందుకీ జవానీ చిత్రాన్ని ఈయనే నిర్మించారు. దేవి చిత్రానికి కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు.

ఇక రియాన్ ఇవాన్ స్టీపెన్ పనిచేసిన హీరోయిన్ కియారా అద్వానీ, హీరో వరుణ్ ధావన్, దియా మీర్జా, సీనియర్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ లాంటి స్టార్స్ సోషల్ మీడియాలో తమ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మన ప్రాణాలు కాపాడుకోవాలంటే.. ప్రభుత్వానికి సహకరించండి : కీర్తి సురేష్

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ కొత్త చిత్రం!

ఆ క్షణంలో ఎంతో భయపడ్డాను : రాశీఖన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -