ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళికి కోపం వస్తే ఎవరు ఆపలేరు అని కొందరు అంటుంటారు. ఆయన తను నమ్మింది గట్టిగా చెప్పాడానికి వెఅనకడరు. ఈ నేపధ్యంలో ఆయన కామెంట్స్ ఎప్పటికప్పుడు సంచలనం రేపుతూంటాయి. అయితే పోసాని తాజాగా ప్రముఖ తెలుగు టీవి ఛానెల్ టీవి 5 లైవ్ పోగ్రామ్ కు వచ్చారు.
అక్కడ పోసాని ఆవేశం హద్దులు దాటింది. అది ఎక్కడిదాకా వెళ్లిందంటే నీయమ్మ అంటూ కోపంతో ఊగోపోయేదాకా. ప్రముఖ కాంగ్రేస్ నేత విహెచ్ హనుమంతరావు మీద ఆయన మండిపడ్డారు. లైవ్ డిస్కషన్ ఏమిటీ అంటే..సరిహద్దుల్లో సైన్యం చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ విషయం. సర్జికల్ స్ట్రెక్స్ గురించి చర్చా కార్యక్రమానికి పోసాని ని కూడా పిలిచారు. ఆయనతో పాటు కాంగ్రేస్ నేత విహెచ్, సిపీఐ నారాయణ కూడా వచ్చారు. ఈ డిబేట్ లో భాగంగా పోసాని..తాను మోడీని అభిమానిస్తానని, ఇండియాలో మోస్ట్ హానెస్ట్ పర్శన్ మోడి అని, తాను బీజెపీ పార్టీ కాదని అన్నారు.
మోడీ పాకిస్తాన్లో పర్యటించి స్నేహహస్తం చాటినా ఉపయోగం లేకపోయిందని పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వీహెచ్ పోసానికి అడ్డు తగిలారు. వెంటనే పోసాని మనం మనుష్యులం…పిచ్చి కుక్కలం కాదంటూ మండిపడ్డారు. అయినా వీహెచ్ ఆగకుండా మోడీ నిజాయితీ గురించి ఇక్కడెందుకు మాట్లాడుతున్నావు.. కావాలంటే బయటికెళ్లి మాట్లాడుకో అనడంతో పాటు ‘ఏయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావ్’ అన్నారు. అంతే పోసాని రెచ్చిపోయాడు.. నీ అమ్మా అనడడంతో పాటు నానా బూతులు తిడుతూ వీహెచ్ మీదకు దూకుడుగా వెళ్లాడు. అయితే పక్కనే ఉన్నారు పోసాని అడ్డుకున్నారు.
{youtube}EJb15QofiGc{/youtube}
Related