ఆర్ఎక్స్100 చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం సినిమా ‘చావు కబురు చల్లగా’. విభిన్న కథాంశంతో వస్తున్న ఈ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో..బన్నీ వాసు నిర్మాతగా రాబోతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, టైటిల్సాంగ్, టీజర్ ప్రేక్షకులను ఎంతో ఫిదా చేశాయి. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శుక్రవారం చావు కబురు చల్లగా ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, డాక్టర్ మల్లికగా లావణ్య తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. కార్తికేయ చెప్పే డైలాగులు బాగున్నాయి. కాగా దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు ఆరవింద్ గీతా ఆర్ట్స్-2 బ్యానర్లో బన్ని వాసు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ క్రమంలో మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం ప్రకటించింది. బస్తీ బాలరాజు, మల్లిగా లావణ్య త్రిపాఠి ఎంతో ఆకట్టుకున్నారు. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో.. అద్భుతమైన ఎమోషన్స్తో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి.. అలాగే లావణ్య త్రిపాఠి గెటప్.. సినిమాపై ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తున్నాయి.
యువ బ్యాట్స్మన్ శతకం.. ఎన్ని ఫోర్లు అంటే..!