Sunday, April 28, 2024
- Advertisement -

నటితో సహజీవనం.. ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే 3 కోట్లు డిమాండ్!

- Advertisement -

పెళ్లి పేరుతో తనని మోసం చేసి గత ఐదు సంవత్సరాల నుంచి తనని వాడుకున్నాడని తమిళనాడు మాజీ మంత్రి మణికంఠన్‌పై నటి చాందిని శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.గత ఐదు సంవత్సరాల నుంచి మంత్రి తనతో సహజీవనం చేస్తూ తన పై మోజును తీర్చుకున్నాడని ఈ క్రమంలోనే తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరడంతో తనని బెదిరిస్తున్నాడని నటి పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రితో తీసుకున్న ఫొటోలను మీడియాకు చూపెడుతూ నన్ను నమ్మించి మోసం చేశాడని,మూడు సార్లు గర్భం దాల్చగా గర్భాన్ని తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. చివరికి తాను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో తన కుటుంబం పై దాడులు చేస్తున్నారని, మంత్రి మణికంఠన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని చాందిని పేర్కొన్నారు.

Also read:M Tech పూర్తి చేశా కానీ రూ. 200 సంపాదించా: కెవ్వు కార్తీక్

ఈ క్రమంలోనే మంత్రి స్పందిస్తూ అసలు చాందిని అంటే ఎవరో తనకు తెలియదని,ఎంతో మంది నాతో ఫోటోలు దిగుతుంటారు. ఈ క్రమంలోనే నాతో దిగిన ఫోటోలను అడ్డుపెట్టుకొని ఈ విధంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తుందన్నారు. మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు నాకు ఫోన్ చేసినటి చాందినితో కలిసి ఉన్న ఫోటోలు తమ వద్ద ఉన్నాయని అవి బయటకు తెలియకుండా ఉండాలంటే మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, అందుకు తాను అంగీకరించలేదని మంత్రి తెలిపారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలను తాను చట్టపరంగా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా మాజీ మంత్రి తెలిపారు.

Also read:అరియనా వాట్సాప్ డీపీ, వాల్ పేపర్ చూస్తే.. షాక్ అవ్వాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -