టాలీవుడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఛార్మి ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటూ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో కలిసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించించిన పూరి జగన్నాథ్, ఛార్మీలు ఈ బ్యానర్పై ఇప్పటికే పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు.పూరి కనెక్ట్స్ బ్యానర్ వ్యవహారాలన్నీ ఛార్మీనే నిర్వహిస్తు ఛార్మీ ముంబైలో ఉన్నారనే సంగతి తెలిసిందే.
హీరోయిన్ ఛార్మి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. పెళ్లికి ఛార్మీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, పూరి భార్య వార్నింగ్ ఇచ్చిందని ఇలా ఏవేవో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
తాజాగా ఛార్మీ ఓ పోస్ట్ చేసింది. సైలెంట్గా ఉండండి మీ కుక్కను హగ్ చేసుకోండి అని అదిరిపోయే ఫోటోను షేర్ చేశారు. తన పెట్ మీద కాలేసుకుని సోఫా మీద పడుకున్న ఫోటోను ఛార్మీ షేర్ చేయగా అది వైరల్ అవుతోంది.
Also read:కరోనా వచ్చినప్పుడు వారే నాకు దైర్యం చెప్పారు: అనిల్ రావిపూడి
పూరి కనెక్ట్స్ బ్యానర్పై ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపొందించి భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న ఛార్మి.ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తయింది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
Also read:బాలయ్య, ప్రభాస్, మహేష్ బాబుకు ఇష్టాలు ఒకేలా ఉన్నయ్యిగా?