- Advertisement -
విజయ్ దేవరకొడం ,రష్మీక హీరో,హీరోయిన్లుగా నటించిన ‘గీతా గోవిందం’ గత శుక్రవారం విడుదలై మంచి విజయం సాధించింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ భారీ వసూళ్లను సాధిస్తూ విజయ విహారం చేస్తోంది.దీంతో ఈ సినిమా టీమ్ విజయోత్సవ వేడుక నిర్వహించాలని నిర్ణయించుకుంది.
ఆదివారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో విజయోత్సవ వేడుకను జరపనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరుకానున్నారు.సినిమా మూడు రోజుల్లోనే 25 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తుంది.ఇక ఇప్పటికే టాలీవుడ్కు చెందిన ప్రముఖులు గీతా గోవిందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.