రాజకీయాలు వదిలేశాక మెగాస్టార్ చిరంజీవి వెంట వెంటనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖైదీ నంబర్ 150తో రీఎంట్రీ ఇచ్చిన చిరు.. ఆ తర్వాత సైరాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ తుదిదశకు చేరుకున్నది. దీనికి దర్శకుడు కొరటాల శివ కాబట్టి.. ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఈ సినిమా వెంబడే మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ రీమేక్లో చిరంజీవి నటించనున్నాడు.
ఆచార్య షూటింగ్ పూర్తయిన వెంబడే.. లూసిఫర్ షూటింగ్లోకి జాయిన్ అవుతాడని టాక్ వినిపిస్తోంది. లూసిఫర్ రీమేక్ కి మ్యూజికల్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయని సంగీత దర్శకుడు థమన్ తెలిపాడు. ఈ విషయంపై దర్శకుడు మోహన్ రాజా స్పందిస్తూ.. థమన్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు . త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం..అంటూ ట్వీట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
అసలు లూసిఫర్ రీమేక్కు డైరెక్టర్ పై ఇంకా క్లారిటీ లేదంటూ వార్తలు వినిపించాయి. అయితే మోహన్రాజా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఈ మూవీ తర్వాత చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. వేదాళం రీమేక్ కూడా చిరు లైన్ లో ఉంది.
Also Read