Thursday, April 25, 2024
- Advertisement -

అతి త్వరలో లూసిఫర్ రీమేక్​ షూటింగ్​.. మెగాస్టార్ తగ్గట్లేదు..!

- Advertisement -

రాజకీయాలు వదిలేశాక మెగాస్టార్​ చిరంజీవి వెంట వెంటనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఖైదీ నంబర్​ 150తో రీఎంట్రీ ఇచ్చిన చిరు.. ఆ తర్వాత సైరాతో హిట్​ కొట్టాడు. ప్రస్తుతం ఆచార్య షూటింగ్​ తుదిదశకు చేరుకున్నది. దీనికి దర్శకుడు కొరటాల శివ కాబట్టి.. ఈ మూవీ కచ్చితంగా హిట్​ అవుతుందని ఫ్యాన్స్​ ఆశతో ఉన్నారు. ఈ సినిమా వెంబడే మలయాళంలో హిట్​ అయిన లూసిఫర్​ రీమేక్​లో చిరంజీవి నటించనున్నాడు.

ఆచార్య షూటింగ్​ పూర్తయిన వెంబడే.. లూసిఫర్​ షూటింగ్​లోకి జాయిన్​ అవుతాడని టాక్​ వినిపిస్తోంది. ​లూసిఫర్ రీమేక్ కి మ్యూజికల్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయని సంగీత దర్శకుడు థమన్ తెలిపాడు. ఈ విషయంపై దర్శకుడు మోహన్ రాజా స్పందిస్తూ.. థమన్​ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు . త్వరలోనే షూటింగ్​ ప్రారంభిస్తాం..అంటూ ట్వీట్​ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు.

అసలు లూసిఫర్​ రీమేక్​కు డైరెక్టర్​ పై ఇంకా క్లారిటీ లేదంటూ వార్తలు వినిపించాయి. అయితే మోహన్​రాజా ఫిక్స్​ అయినట్టు తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఈ మూవీ తర్వాత చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. వేదాళం రీమేక్ కూడా చిరు లైన్ లో ఉంది.

Also Read

ఇండస్ట్రీకి గుడ్ బాయ్ చెప్పిన స్టార్ హీరోయిన్ కూతురు?

లైగర్​ మార్కెట్​ .. ఈ రేంజ్​లోనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -