ఏ ఇద్దరూ మెగా ఫ్యాన్స్ కసిసినా ఒకటే చర్చ, చిరంజీవి 150వ ఫిల్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. అయితే చిరు మాత్రం తన కెరీర్లో మైలు రాయిలా నిలిచే 150వ సినిమా చేదు జ్ఞాపకంగా మిగిలి పోకూడదని కోరుతున్నాడు.
అందుకే మెగాస్టార్కి సెట్ అయ్యే పవర్ఫుల్ స్క్రిప్ట్ తీసుకొస్తే ఆ రైటర్కు కోటి రూపాయల రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చింది మెగా క్యాంప్.
ఇలా ఆఫర్ ఇచ్చాడంటేనే తెలుస్తోంది చిరంజీవి తన 150వ సినిమా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో.. ఇప్పుడు ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయబోతున్నాడని ఫస్ట్ ఆఫ్ మొత్తం నెరేట్ చేశాడని ఇక సెకండ్ ఆఫ్ కూడా నచ్చితే సినిమా సెట్ మీదకు వెళుతుందని ఇది వరకు తెలిసిందే.
అయితే తాజాగా మళ్ళీ డైరెక్టర్పై కొత్త వార్త ఫిల్మ్ నగర్ ఏరియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ చిరంజీవి 150వ సినిమా చేయబోతున్నాడని అందుకే తరచూ చిరంజీవి ఇంటికి వెళ్ళి సినిమా గురించి చర్చిస్తున్నారని పుకార్లు బయటికి వస్తున్నాయి. పూరి జగన్నాథ్ ప్లేస్లో వి.వి వినాయక్ని ఎంపిక చేశారని కూడా అంటున్నారు.
కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం చిరంజీవి తన ఇంట్లో ఉన్న స్టెప్ మీద నుంచి కింద పడి లెగ్ ప్రాక్చర్ అయిందట. అందుకే వి.వి వినాయక్ చిరు ఇంటికి వెళ్ళి చూసి పలకరించి వచ్చాడట.వి.వి వినాయక్ మర్యాద పూర్వకంగా కలిశాడే తప్ప సినిమా గురించి చర్చకు రాలేదని అంటున్నారు.
ఒకవేళ సినిమా గురించి వినాయక్ చర్చించినా బయటికి చెప్పడం లేదేమో. మరి ఏం జరిగిందో వారిద్దరూ చెప్పే వరకు ఎవరికి తెలీదు. అంతా సస్పెన్స్లోనే ఉంది.