Friday, March 29, 2024
- Advertisement -

అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ పెట్టిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌,క‌ల్యాణ్‌రాం ఇద్ద‌రు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇద్ద‌రి సినిమా ఫంక్ష‌న్‌ల‌కు ఒకరికిఒక‌రు వ‌స్తు వారి సినిమాల‌కు స‌పోర్టు చేస్తుంటారు.కాని గ‌త కొంత కాలంగా ఎన్టీఆర్‌,క‌ల్యాణ్ రాంకు మ‌ధ్య కొంత గ్యాప్ వ‌చ్చిందని అంటున్నారు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.క‌ల్యాణ్ రాం న‌టించిన ప్ర‌తి సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు వ‌చ్చి ఆయ‌న సినిమాల‌కు ప్ర‌మోష‌న్స్ చేస్తుంటాడు.అయితే క‌ల్యాణ్‌రాం గ‌త రెండు సినిమాల‌కు ఎన్టీఆర్ రావ‌డం లేదు.దీనికి కార‌ణం ఎన్టీఆర్ బ‌యోపిక్ అనే తెలుస్తుంది.

సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాను ఆయ‌న త‌న‌యుడు హీరో నంద‌మూరి బాల‌కృష్ణ నిర్మిస్తున్నాడు.బాలకృష్ణ‌కు తార‌క్‌కు పెద్ద‌గా సంబంధాలు లేవ‌ని అంద‌రికి తెలిసిందే.ఈ సినిమాలో నంద‌మూరి వంశం వారు అంద‌రు న‌టిస్తున్నారు,కాని ఎన్టీఆర్‌కు మాత్రం పిలుపు రాలేదు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పాడు.బ‌యోపిక్ సినిమాలో క‌ల్యాణ్ రాంతో పాటు ఆయ‌న త‌న‌యుడు కూడా న‌టిస్తున్నాడు. దీంతో తీవ్ర కోపంలో ఉన్నాడు తార‌క్‌.నన్ను పిలువ‌కుండా త‌న అన్న‌ను పిలిచి నన్ను అవ‌మాన‌ప‌రిచార‌ని భావిస్తున్నాడు ఎన్టీఆర్‌.ఇక ఈ విష‌యంలో అన్న క‌ల్యాణ్‌రాం కూడా పెద్ద‌గా ఎన్టీఆర్‌కు స‌పోర్టు చేయ‌లేద‌ని ఎన్టీఆర్ వాద‌న‌.

అయితే లోన ఎలా ఉన్నా పైకి క‌లిసి ఉన్నామ‌ని చెబుతున్నారు.అందుకే క‌ల్యాణ్‌రాం ఎమ్మెల్యే,నా నువ్వే సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు రాకుండా దూరంగా ఉన్నాడు  తార‌క్‌.ఇదే స‌మ‌యంలో మ‌హేష్ బాబు భ‌ర‌త్ అను నేను ,కీర్తి సురేష్ మ‌హ‌న‌టి సినిమా ప్రీ రీలిజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన తార‌క్ త‌న అన్న క‌ల్యాణ్‌రాం సినిమాల‌కు మాత్రం దూరంగా ఉంటున్నారు. క‌లిసిమెలిసి ఉంటున్న అన్న‌ద‌మ్ముల మ‌ధ్య ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమా వ‌చ్చి చిచ్చు రేపింది అని నంద‌మూరి అభిమానులు అనుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -