హీరోయిన్ స్వాతి ‘కలర్స్’ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయిన సంగతి అందరికి తెలిసిందే.అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్గా మారిన స్వాతి తెలుగులో కన్నా తమిళంలో ఎక్కువ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.డేంజర్,గోల్కొండ హైస్కూల్, కలవరమాయె మదిలో, స్వామి రారా, కార్తికేయ తదితర చిత్రాలలో హీరోయిన్గా నటించింది.అయితే స్వాతి పెళ్లిపీటలు ఎక్కబోతోందనే వార్తలు వినబడుతున్నాయి.ఆగస్టు 30వ తేదీ రాత్రి స్వాతి వివాహం హైదరాబాద్లో జరగనుందని తెలిపారు.
సెప్టెంబర్ రెండో తేదీన కోచిలో రిసెప్షన్ ఉంటుందని సమాచారం. ఆమె పెళ్లిచేసుకోబోయే వరుడు పేరు వికాస్.. మలేషియా ఎయిర్లైన్స్లో పైలెట్గా పనిచేస్తాడని.. ఇండోనేషియాలోని జకార్తాలో నివాసం ఉంటున్నట్లు చెప్పారు. వీరిది లవ్ కమ్ పెద్దలు కుదిర్చిన వివాహమని సమాచారం. వీరి పెళ్లి విషయాన్నిఅసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ శ్రీ తన ట్వీట్టర్లో పోస్ట్ ద్వారా వెల్లడించారు.