టాలీవుడ్ నటులు విడిపోయారు.విడిపోవడం అంటే సినిమా పరంగా కాదు,రాజకీయంగా విడిపోయి ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటున్నారు.నిర్మాత ,నటుడు బండ్ల గణేష్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.ఆయన పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు.అయినప్పటికి పార్టీ తరుపున ప్రచారం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారం చెపబడుతుందని ఆయన జోస్యం చెప్పారు.లేని పరిస్థితులలో నేను సెవన్ ఓ క్లాక్ బ్లేడ్తో మెడ కోసుకుంటానని గణేశ్ తెలిపారు.బండ్ల గణేష్ చేసిన కామెంట్స్పై కమెడియన్ పృథ్వీ సెటైర్లు వేశాడు.
గణేశ్ అన్న వ్యాఖ్యలపై స్పందించిన పృథ్వి ఆ విషయాన్ని ముందు పోలీసులకు చెప్పాలన్నారు. ఆయన్ను కాపాడమని పోలీసులకు చెప్పాలి ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకోవాలి అంటూ నవ్వులు కురిపించారు. అంతేకాదు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్తో కూడా గణేశ్ ఫొటో తీయించుకునే శక్తి ఉన్నోడంటూ మరో పంచ్ లు వేశారు. అయితే తనకు అంత శక్తి లేదన్నారు. గణేశ్ మంచి ప్రొడ్యూసరని, తనకు మంచి మిత్రుడని అభిప్రయాపడ్డారు. ఆయన రాజకీయాల్లోకి రావడమే ఆశ్చర్యంగా ఉందన్నారు పృథ్వీ.