ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా మహమ్మారితో పలువురు సినీ ప్రముఖులు కన్నుమూశారు. ఈ మద్య కరోనా కాస్త అదుపులోకి రావడం.. లాక్ డౌన్ సడలింపులు చేయడం జరుగుతుది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన శాండల్ వుడ్ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బెంగళూరులోని ఓ స్నేహితుడి ఇంటి నుంచి సొంతింటికి బైక్ మీద వెళుతుండగా… ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. న్యూరోసర్జన్ అరుణ్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. సంచారి విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపాడు. అంతేకాదు అతడి మెదడులో రక్తం గడ్డ కట్టిందని.. దానికోసం సర్జరీ చేసమని చెప్పారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని తెలిపారు వైద్యులు.
విజయ్ 2011లో విడుదలైన ‘రంగప్ప హోంగ్బిట్నా’ అనే సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ‘హరివూ’, ‘ఒగ్గరానే’ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘నాను అవనాల్ల… అవలు’ సినిమాలో ట్రాన్స్జెండర్గా నటించి జాతీయ అవార్డును అందుకున్నారు. విజయ్ త్వరగా కోలుకోవాలని ఆయ హితులు, సన్నిహితులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!